Wednesday, May 28, 2014

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు :)

కానిస్టేబుల్ కావాలంటే పది పాసవ్వాలి కాని కేంద్ర మంత్రి కావాలంటే అవసరం లేదు. ఎంత అసంబద్ధం? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఆరుగురు పదో తరగతి లేదా ఆ లోపు చదివిన వారు ఉన్నారు. ఒక చిన్న కంపెనీకి అకౌంటెంట్ ని ఎంపిక చేయాలంటేనే డిగ్రీ చూస్తారు, అనుభవం చూస్తారు, పరీక్ష చేసి వీడు మన కంపెనీ ని వృద్ధిలోకి తీసుకు వచ్చే సత్తా ఉంది అంటేనే ఎంపిక చేస్తారు. అలాంటిది ఒక దేశం(లేదా రాష్ట్రం) మొత్తానికి ప్రాతినిధ్యం వహించే శాఖల మంత్రులకి మాత్రం ఏ అర్హత అవసరం లేదు. ఏమి చేసి అయినా సరే ప్రజా ప్రతినిధి గా గెలిచే సత్తా, ప్రజా బలం ఉంటె చాలు. అయిదేళ్ళు అయిపోతే మళ్లీ కొత్తవాడు. మన అదృష్టం ఏమిటంటే బలమైన పరిపాలనా వ్యవస్థ ఉండటం.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అలాగే బాగా చదువుకున్న వాడు బాగా పని చేస్తాడని, చదువుకొని వాడు ఏమి చేయలేడు అని కూడా లేదు. అయితే, ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక కనీస విద్యార్హత (ఉదాహరణకు ఆర్ధిక శాఖ అయితే కనీసం b.com చదివి ఉండటం), ఆ రంగం లో కనీస అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.

మీ అభిప్రాయం ఏమిటి ?

No comments:

Post a Comment

Comments