Monday, June 23, 2014

ఆంధ్రప్రదేశ్ - అభివృద్ది నమూనా : ఆపత్కాల సమాచార వ్యవస్థ


ఉపోద్ఘాతం

రాష్ట్రం విడిపోయింది. ప్లస్ లన్నీ తెలంగాణాకి మైనస్ లన్నీ AP కి వేసి వదిలిపెట్టారు కేంద్రం పెద్దలు. అప్పుల్లో ఉదారంగా భాగం ఇచ్చారు.ఆస్థులొచ్చేసరికి మీవి కాదు పొమ్మన్నారు. రాజధాని లేకుండా, CM, మంత్రులు, ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలో తెలియకుండా చివరికి గోచి గుడ్డ మిగిల్చారు. సరే జరిగిందేదో జరిగింది. చంద్రబాబు చెప్పినట్టు కుంగిపోకుండా సమస్యలోనే ఒక అవకాశం చూసి అంతకు మునుపు కంటే ఎక్కువ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. మనకున్న వనరులను, శక్తి సామర్థ్యాలను కూడదీసుకుని ప్రణాళికా బద్దంగా అభివృద్ది చెందవలసిన సమయమిది. 

మన ప్రస్థానం మొదటి నుండి మొదలుపెట్టాల్సి ఉంది. ఈ సమయంలో మంచి అభివృద్ది నమూనా ఎక్కడున్నా అనుసరించి ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది చేస్తే భవిష్యత్ తరాలకి మేలు చేసిన వాళ్లవుతాము. కొన్ని సార్లు ఆలోచిస్తే అసలు మన అధికారులకి, నాయకులకి బుర్ర పని చేస్తోందా అనే అనుమానం కలుగుతుంది.ప్రతి నాయకుడు, అధికారి వేరే దేశానికి ఒక్క సారైనా వెళ్లి ఉంటాడు. అక్కడ పరిసరాలని గమనిస్తే అక్కడ ట్రాఫిక్ క్రమ పద్ధతిలో అంత స్పీడ్ గా  ఎలా వెళ్తోంది ? రోడ్లు గుంటలు లేకుండా ఎలా ఉన్నాయి? మురుగు నీరు కంపు ఎందుకు రావట్లేదు ఇలా ఒక్కొక్క  ప్రశ్న వేసుకున్నా ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరికేది. కనీసం కాపీ కొట్టి కూడా నేర్చుకోవడం రాకపోతే ఏమనాలి? పాశ్చాత్యదేశాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అభివృద్ది చెందిన దేశాలలో, ముఖ్యంగా అమెరికాలో నా దృష్టికి వచ్చిన మంచి  నియమాలు, నిబంధనలు, అలవాట్లు, వ్యవస్థల గురించి పంచుకోవాలనే ఈ ప్రయత్నం. ఇలాంటివి  మీ దృష్టికి ఏమైనా వస్తే దయచేసి పంపండి. ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాను. ఈ సిరీస్ లో మొదటిది - 

ఆపత్కాల సమాచార వ్యవస్థ (Emergency messaging system)

బియాస్ నది దుర్ఘటన - ఇది చాలా దురదృష్టమైన సంఘటన. చిన్న ప్రయత్నం తో వారించతగిన (avoidable) సంఘటన. ఇది జరిగిన కొన్ని రోజులకి అమెరికాలో నేనున్న ప్రదేశం లో వర్షం పడుతోంది. ఆఫీసు నుండి బయలుదేరుతుండగా ఒక మెసేజ్ వచ్చింది. ఇది ఆ మెసేజ్ 


ఈ ఏరియాలో వర్షం వల్ల  అనుకోని వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలని వారించండి అని ఆ మెసేజ్ సారాంశం. ఇది ఎక్కడైతే ప్రమాదం ఉందొ ఆ ఏరియా సెల్ టవర్ పరిధి లో ఉన్న అన్ని సెల్ ఫోన్ లకి పంపుతారు. ఎంత సులభమైన పరిష్కారం? 

ఇవ్వాళ దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా సెల్ ఫోన్ ఉంది. చేయాల్సిందల్లా అధికారులు సెల్ ఆపరేటర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందొ ఆ సెల్ టవర్ పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ మెసేజ్ పంపడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అలాంటి వ్యవస్థ ఉండి ఉంటె 25 నిండు ప్రాణాలు బలైపోయేవి కాదు. కనీసం ప్రమాదం జరిగిన తరువాత అయినా మేలుకుని అన్ని ఆనకట్టల వద్ద ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి నీరు వదిలే ముందు కింద ఒక 10 కిలో మీటర్ల  పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్న సెల్ ఫోన్ లన్నిటికీ ఇలాంటి మెసేజ్ పంపితే చాలా ప్రాణాలు కాపాడొచ్చు. ఇదే కాదు ఇక్కడ పోలీస్లకి దొరకకుండా తప్పించుకున్న వాహనాల నెంబర్ లు లేదా వాహనాలు తస్కరించినా కూడా ఆ చుట్టు పక్కల ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ లకి  మెసేజ్ చేస్తారు, కనిపిస్తే పోలీస్ లకి తెలపమని. 

అధికారులకి తెలిసి ఆనకట్ట గేట్లు ఎత్తారు కాబట్టి ఇలాంటి సంఘటనల్లో ఇలాంటి వ్యవస్థ ఉపకరిస్తుంది. మరి అనుకోకుండా కొండల్లో నుండో, ఉపనదుల నుండో మొన్న ఉత్తరాఖండ్ లో వచ్చిన లాంటి వరదలు వస్తే ? దానికి సులభమైన పరిష్కారం - ఎక్కడైతే అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందో ఉదాహరణకి ఒక ఉప నది ఒక నదిలో కలిసే చోటు నుండి అక్కడక్కడా నీరు ఒక నిర్దేశిత ఎత్తుకు రాగానే నివేదించే ఎలక్ట్రానిక్ పరికరాలు పెట్టి వాటిని సంబంధిత రివర్ అథారిటీ ఆఫీసుకి అనుసంధానిస్తే సరిపోతుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కావాల్సిందల్లా పరిష్కారాన్ని అన్వేషించి దాన్ని చిత్త శుద్ధితో అమలు చేయడమే. 

ఉదాహరణకి ఈ లింక్ చూడండి - http://embedded.asti.dost.gov.ph/projects/water-level-monitoring-system/

ఇలాంటి పరిష్కారాలు ఇంజనీరింగ్ విద్యార్థులే అలోచించి ఒక పరికరాన్ని కనుక్కోవచ్చు. చివరికి వెస్ట్రన్ టాయిలెట్స్ ఫ్లష్ లో వాడే టెక్నాలజీ వాడైనా ఒక పరికరం తయారు చేయోచ్చు.మన రాష్ట్రంలోనే కొన్ని వందల సాంకేతిక విద్యా సంస్థలున్నాయి. ప్రతీ కాలేజీ డిపార్టుమెంటు నుండి సంవత్సరానికి ఒక్క సమస్యకి పరిష్కారం కనుగొన్నా మనం టెక్నాలజీ కోసం వేరే దేశాల మీద ఆధారపడే అవసరం ఉండదు. 

సమస్య వచ్చిన ప్రతిసారీ అప్పటికప్పుడు కంటి తుడుపు చర్యలు చేపట్టకుండా శాశ్వత పరిష్కార మార్గాలు అలోచించి బియాస్ నది దగ్గర జరిగింది కాబట్టి అక్కడ మాత్రమె కాకుండా, ఎక్కడ ఇలాంటి పరిస్థితులున్నాయో అన్ని చోట్లా అమలు చేస్తే ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు . 







Sunday, June 22, 2014

విభజన విషఫలాలు - తెలంగాణావాదుల అరాచకత్వం

కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజిస్తూ ఉంటె అడ్డు చెప్పిన ప్రతి వాడి మీదా రాళ్ళేశారు విభజన వాదులు. హైదరాబాద్, నీళ్ళు, కరెంటు, భద్రాచలం అంశాలు తేల్చటం చాల కష్టం అంటే నవ్వుకున్నారు. చంద్రబాబు సమ న్యాయం అంటే  గేలి చేశారు. కానీ ఇప్పుడు ఇవే బండలై కూర్చున్నాయి. ఈ అస్తవ్యస్త విభజనతో ప్రతి ఆంధ్రుడి గుండె తీవ్రంగా గాయపడింది. దాన్ని తెలంగాణా వాదులు  వాళ్ళ మాటలతో, చేతలతో ఇంకా కెలికి కారం పూసినట్టు ఉంది. ఇప్పటికి తెలంగాణా వాదులకి చాలా ఆనందంగా ఉండొచ్చు. కానీ ముందు ముందు తెలుస్తుంది దాని ప్రభావం. నేనొక జాతీయ వాదిని. ఇన్ని రోజులు మా స్వచ్చంద సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది విద్యార్థులకి ప్రాంతీయ భేదం లేకుండా సాయం చేసాం. కానీ నా వరకు ఇక నుండి ఆ పరిస్థితి ఉండదు. నన్ను నా జాతిని అవమానపరిచి, విడిపోయినందుకు సంబరాలు చేసుకునే జాతి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఇక విభజన విష ఫలాలకి వస్తే

హైదరాబాద్
ఇది అన్ని సమస్యలకి  మూల కారణం అవుతోంది. వెనకా ముందూ ఆలోచించకుండా 58 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని కేవలం భౌగోళిక కారణాలతో అన్ని హక్కులూ ఒకే ప్రాంతానికి ధారాదత్తం చేయడం కాంగ్రెస్ పెద్దల మేధావితనానికి నిదర్శనం. దానికి శల్య సారధ్యం చేసిన మన కాంగ్రెస్ నాయకులని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలా ధారాదత్తం చేయడం వాళ్ళ వచ్చిన సమస్యలు

1. ఆదాయం:  రాష్ట్ర రాజధాని కావటం ఎన్నో సంస్థలు, వ్యాపారాలు నెలకొల్పబడ్డాయి. వాటన్నిటి మీద ఒక్కసారిగా  హక్కు కోల్పోయాం. ఆస్థిపై, ఆదాయం పై హక్కు కోల్పోయాం. దీని వల్ల తెలంగాణా మిగులు రాష్ట్రం అయితే ఆంధ్ర ప్రదేశ్ లోటు  బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది. పైగా ఈ సంస్థలన్నీ రావడానికి కారణం రాష్ట్రానికి రాజధాని అని లేదా ముఖ్యమంత్రుల వల్ల లేదంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు మాది అనుకుని పెట్టుబడి పెట్టడం వల్ల.మెజారిటీ  ఆదాయం రావడానికి కారణం డైరెక్ట్ గా కానీ ఇన్డైరెక్ట్ గా కానీ సీమాన్ద్రులే కారణం. హైదరాబాద్ ఆదాయానికి తెలంగాణా వాళ్ళ పాత్ర నామ మాత్రం. IT, విద్య, వైద్యం, సినిమా, ఫార్మా, మౌలిక సదుపాయాలు ఇలా ఏ రంగం తీసుకున్నా సీమాంధ్రుల పాత్రే అధికం. కానీ ఒక్క దెబ్బతో సీమాంధ్రుల 58 ఏళ్ళ మొత్తం శ్రమని తెలంగాణా కి దోచి పెట్టారు. పైగా సీమంద్రులే మమ్మల్ని దోచుకున్నారు అని ముద్ర కొట్టి మరీ పంపిస్తున్నారు. సీమంధ్రులు వద్దు కానీ వారు సృష్టించిన సంపద మాత్రం కావాలి. ఇదీ తెలంగాణా అరాచకవాదుల  ఆత్మగౌరవం. 

2. స్థానికత : మాది అనుకుని తమ సొంత ఊర్లతో అన్ని బంధాలూ తెంచుకుని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారి గుండె మంట ఎవరికి అర్థం అవుతుంది? ఇదే ప్రశ్న అడిగితే హైదరాబాద్ లో ఉన్నోల్లంతా హైదరాబాదోల్లె, ఎవరినైనా వెల్లమన్నమా అని మీడియా ముఖంగా బ్లాగుల్లో కారు కూతలు కూసారు అరాచక వాదులు. ఇప్పుడెం చేస్తున్నారు.

విద్యార్థులు:

తండ్రి తెలంగాణాలో పుడితేనే స్థానికుడట. ఎంత అరాచకం. 

దేశమంతా 4 ఏళ్ళు ఒక చోట చదివితే స్థానికుడు అవుతాడు. లేదా 7 ఏళ్ళు ఒక చోట ఉంటె స్థానికుడు అవుతాడు. కానీ తెలంగాణాలో మాత్రం ఒక ఇంజనీరింగ్ చదువుతున్న వ్యక్తి వాళ్ళ నాన్న 2 ఏట ఇక్కడికి వచ్చి స్థిర పడ్డా (అంటే దాదాపు 40 ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నా) ఆ ఇంజనీరింగ్ చదివే అబ్బాయి స్థానికుడు కాదు. ఎంత అరాచకం. తెలంగాణా వాదులకి ఇప్పుడు చట్టాలూ, రాజ్యాంగాలూ గుర్తుకు రావు. ఇది తప్పు అని కనీసం ఒక ఖండన కూడా ఉండదు.

చివరికి వేరే దేశం అమెరికాలో, అక్కడ పుడితే తల్లి తండ్రి ఎక్కడి వాళ్ళు, ఎన్ని రోజుల నుండి ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా పౌర సత్వం వస్తుంది. అమెరికన్లతో సమానంగా హక్కులు, ప్రయోజనాలు పొందొచ్చు. లేదా అమెరికన్ అబ్బాయిని కాని అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే 4 ఏళ్ళలో పౌరసత్వం వస్తుంది.లేదా ఉద్యోగ పరంగా అక్కడికి వెళ్లి స్థిర పడితే 12 ఏళ్లలో లేదా 15 ఏళ్ళలో అక్కడి పౌరసత్వం వస్తుంది. కానీ ఇన్ని రోజులు సొంత రాష్ట్రం, మన దేశం లో 40 ఏళ్ళు ఒక కుటుంబం ఒక చోట స్థిర పడ్డా స్థానికుడు కాదు అంటే ఇంకేమనాలి? వాళ్ళకి రావలసిన హక్కులు, ప్రయోజనాలు నిరాకరిస్తుంటే ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశం లో, ఇన్ని వ్యవస్థల్లో ఒక్కటి కూడా ఈ అరాచకాన్ని అడ్డుకోలేక పోతోంది. చివరకి దేశ విభజన జరిగిన సమయంలో కూడా తండ్రి ఇక్కడ పుట్టి ఉంటేనే స్థానికుడు అన్న నిబంధన పెట్టలేదు. అలా పెట్టి ఉంటే మన దేశానికి హోం మంత్రిగా పని చేసి రేపో మాపో రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్న లాల్ కృష్ణ అడ్వానీ గారు స్థానికుడు అయి ఉండేవాడు కాదు. ఎందుకంటే అడ్వానీ గారు జన్మించింది పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో. 

ఈ సమయం లో నాకు అమృత సినిమాలోని  ఒక పాట గుర్తుకు వస్తోంది - http://www.raaga.com/player5/?id=6685

ఇక్కడ 40 ఏళ్ళ నుండి లేడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందడు  అని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనలేదు దానికి ధన్యవాదాలు. కానీ ఏ మహా రాష్ట్ర నుండో, ఒరిస్సా నుండో 40 ఏళ్ళ క్రితం కార్మికుడిగా వచ్చి స్థిరపడ్డ వాళ్ళ పిల్లల సంగతేంటి?

ఉద్యోగస్థులు:
వీరి పరిస్థితి కూడా దయనీయం. ఉద్యోగరీత్యా ఉన్న ఊరు వదిలి, అన్ని ఆస్తులు అమ్ముకుని ఇక నుండి ఇది మా నగరమే అనుకుని దశాబ్దాలుగా ఆర్ధిక, సామాజిక బంధాలన్నీ ఇక్కడే ఏర్పరుచుకున్న వాళ్ళని వెళ్లగొట్టే ప్రక్రియకి పూనుకున్న వాళ్ళని ఏమనాలి. 6 పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం అక్రమంగా ఉన్న ఎవరైనా  - తెలంగాణా వారితో సహా వెళ్ళగొడితే, అక్రమంగా వచ్చాడు కాబట్టి అలా చేశారు అనుకోవచ్చు. చట్ట బద్దంగా ఉద్యోగం తెచ్చుకుని ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళని వెళ్ళగొట్టాలని చూడటం దుర్మార్గం. న్యాయంగా తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్న వాళ్లకి ఆప్షన్లు ఇచ్చి వాళ్ళ ఇష్టమొచ్చిన చోట పనిచేసుకునే హక్కు ఉద్యోగులకి ఉంది. కానీ  తమ తెలబాన్ చట్టాన్ని అమలు చేయాలనీ ముందు నుండే బెదిరించి అభద్రత కి గురి చేసి వారికి వారే వెళ్ళిపోతాం అనేలా చేస్తున్నారు.

స్థానికత కి 6పాయింట్ ఫార్ములా ప్రెసిడెంట్ ఆర్డర్ లో ఇచ్చిన నిర్వచనం ఇదీ

A local candidate has been defined with reference to the period of study for four years prior to the date of his appearance at the qualifying examination or matriculation, whichever is lower, in a local area and in cases where no qualification is prescribed, with reference to the residence for four years of the candidate prior to the date of notification of the vacancy. If a candidate is not a local candidate by virtue of 4 years study or residence, as the case may be, he would be a local candidate with reference to the major period of study/residence in a local area within a period of 7 years before the qualifying examination or matriculation, whichever is lower or the date of notification of vacancy, as the case may be. Detailed instructions in this regard have been issued in G.O.P.No. 729, GAD, dated 1.11.75 and G.O.Ms.No.186, GAD, dated: 18.3.1977"

ఇక ఇవ్వాళే వచ్చిన వార్త - గాంధీ వైద్యులు AP అసెంబ్లీ సమావేశాలకి వైద్యులుగా విధులు నిర్వర్తించడానికి  వెళ్ళము అన్నారట. ఇలా ప్రతి విషయం లో అవమానం, వివక్ష. అంతటికీ కారణం కాంగ్రెస్ అపర మేధావులు. చచ్చేదాకా ఈ 'మేలు'ని మర్చిపోవద్దు.

హైదరాబాద్ విషయంలో ఒకే ఒక పరిష్కారం - UT లేదా ప్రత్యెక రాష్ట్రం చేయడం.  దేశం లో ఉండే స్థానికత నిర్వచనం ఆధారంగా స్థానికులకి పెద్ద పీట వేసి మిగిలిన ప్రాంతాలకి జనాభా నిష్పత్తిలో కొన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం. UT చేస్తే అనవసరంగా ఎవరికీ కాకుండా పోతుంది అని ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉంటె మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు అరాచకవాదులు.  UT చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కోల్పోయిన ఆదాయం రాకపోయినా ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు  అభద్రత, అవమానాలకి గురి కాకుండా ఉంటారు. సెకండ్ రేటెడ్ సిటిజెన్ లాగా బతకాల్సిన అవసరం అంత కంటే ఉండదు.

భద్రాచలం 
మాకు 1956 కంటే ముందు ఉన్న తెలంగాణా తప్ప ఒక్క అంగుళం ఎక్కువ వద్దు అని ఎన్నో సార్లు తెలబాన్ నాయకులు మీడియా గొట్టాల ముందు గొంతు చించుకుని అరిచారు. కానీ విభజన దగ్గరకి వచ్చేసరికి ఠాట్ కుదరదంటే కుదరదు అని పేచీ పెట్టుకున్నారు. భద్రాద్రి గుడి మా రాజు డబ్బులతోనే కట్టాడు అని ఒకడంటే, పోలవరం కట్టి మా గిరిజనుల పొట్ట కొడతారా అని ఇంకొకడు. మొత్తం భద్రాచలం కలపకుండా కేవలం ముంపు మండలాలు కలుపుతాం అన్నా పేచీ. మా గిరిజనుల పొట్ట కొడతారా అని. అయ్యా, మా రాష్ట్రం లో పునరావాసం గురించి మేము చూసుకుంటాం మీకెందుకు నొప్పి. పోనీ వాళ్ళు మీ వాళ్ళే అనుకుంటే తెలంగాణా విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా ఫీజులు కడతాం అన్నట్టు గిరిజనులకి కూడా మీరే పునరావాసం కల్పించండి అంత ప్రేమ ఉంటె ఎవరొద్దన్నారు? లేదంటే భద్రాచలం డివిజన్ లోనే వేరే మండలాల్లో పునరావాసం కల్పిస్తాం అని చెప్పండి సరిపోతుంది. ఇవన్నీ చేయరు ఆ మీ రాష్ట్రం లో  ప్రాజెక్ట్ కి మేమెందుకు పునరావాసం కల్పిస్తాం అంటారు. మరదే  చెప్పేది. మా రాష్ట్రం లో పునరావాసం గురించి మీకెందుకు అనే. వాస్తవం ఏమంటే ఆ మండలాలు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపితే ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర ప్రదేశ్ కె చెందుతుంది. పొరపాటున పోలవరం కడితే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది చెందుతుంది అనే కుళ్ళు కుతంత్రమే కానీ వాళ్ళు చేసే వాదన అర్థ రహితం అని వాళ్ళకు మాత్రం తెలీద ఏంటి.

ఈ విషయం లో వార్తలు వస్తున్నట్టు 1956 ముందు ఉన్న ప్రదేశాలు (భద్రాచలం,  మునగాల,అశ్వారావు పేట) డివిజన్ లన్నీ ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలి.

నీళ్ళు 
దీనిపై ఇప్పటికే వివాదం మొదలైంది. పై రాష్ట్రం కాబట్టి ఏమైనా చేయోచ్చు అనుకుంటున్నారు. తమ వాటా ప్రకారం రావాల్సిన 10 TMC ల తాగు నీటిని విడుదల చేయమంటే ఫైల్ ని తొక్కి పెట్టి కూర్చున్నాడు తెలబాన్ నాయకుడు. నీళ్ళ వివాదాలు వస్తాయంటే రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులెం ఉండవు అని గొంతు చించుకున్న వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు. కాస్త గొంతు విప్పి చట్టాలని అక్షరం తో సహా పాటించాలానే తెలంగాణా వాళ్ళే ఎందుకు ఆ చట్టాలు పాటించ లేదో చెప్తే కాస్త విని తరించాలని ఉంది. 

విద్యుత్ 
మాకు కావాల్సిన విద్యుత్ మేము బ్రహ్మాండంగా స్పీడ్ అప్ చేసి ఉత్పత్తి చేసుంటాం అన్నోళ్ళకి AP విద్యుత్తో  ఏమి అవసరం వచ్చింది? ఇదే మాట కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే కిండల్ చేశారు.పునర్విభజన చట్టం లో ఇప్పటికి అమల్లో ఉన్న విద్యుత్ ఒప్పందాల్లో 54% తెలంగాణా కి ఇవ్వాలి అని పెట్ట్టాలని ఏ మేధావికి ఐడియా వచ్చిందో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి.

లక్కీ గా ఇప్పటికి ఒప్పందాలు ఏవి అమల్లో లేవు. కాబట్టి AP లో ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్ ఆ నిష్పత్తి లో ఇవ్వక్కర్లేదు. ERC అప్రూవ్ చేయని ఒప్పందాలని AP జెన్కో పాటించాల్సిన అవసరం లేదు. ఇక ఎవరో ఒక పాయింట్ లాగారు. ERC కి కొత్త ఒప్పందాలు పంపిన నాటి నుండి కొత్త టారిఫ్ లు అమలు అవుతున్నాయి కాబట్టి ఒప్పందాలు అమలైనట్టే అని. అదే ERC రాష్ట్ర విభజన తరువాత రెండు జెన్కో లకి డిస్కం లతో కొత్త ఒప్పందాలు చేసుకుని కొత్త టారిఫ్ లు పంపండి అని చెప్పింది. అదే లాజిక్ ప్రకారం అంతకు ముందు ఒకవేళ ఏవైనా ఒప్పందాలు అమల్లో ఉన్నా చెల్లనట్టే కదా. ఏ రకంగా చూసినా ఏ సెక్షన్ లు ప్రయోగించాకుండానే AP విద్యుత్ AP కె చెందుతుంది. ఇప్పుడు మాత్రం కుట్ర అది ఇది అని వాగుతున్నారు.

వీటన్నిటి పైనా కచరా మాట్లాడిన మాటలు - https://www.youtube.com/watch?v=kQzYDus5BrI

Sunday, June 1, 2014

అరాచక శక్తులే గెలిచాయి!






అరాచక శక్తులే గెలిచాయి. ఇంకొన్ని గంటల్లో తెలుగు నేల రెండుగా చీలబోతోంది. విద్వేషం ముందు పాలు నీళ్ళలా కలిసిపోయిన తెలుగుజాతి తలొంచి ఓడిపోయింది.  గుప్పెడు మంది పద్దతిగా వేరు చేస్తే ఏ జాతిని అయినా విడగొట్టొచ్చు అని నిరూపించాడు తెలబాన్ నాయకుడు.

1956లో తెలంగాణా మొత్తం లో గుంటూరు లో ఉన్న స్కూల్స్ అయినా లేని స్థాయి నుండి, పటేల్ , పట్వారిలని బాంచన్ కాల్మొక్తా అనే స్థాయి నుండి, వ్యసాయం చేయాలంటే పక్క ప్రాంతం వాళ్ళు వచ్చి చేయాలి అనే స్థాయి నుండి అన్ని విషయాలలో పోటీ పడగలిగే స్థాయికి రావడానికి తమ స్నేహ హస్తం అందించి , తమ శక్తి ని ధారపోసిన తోటి సోదరులను దొంగలుగా, దోపిడీ దారులుగా ముద్ర వేసి, జాతి మధ్య వైరుధ్యాల విషం నింపి,  అన్నం పెట్టిన చేతినే నరికి , ఒప్పందాలు అమలు చేయలేదు అని ఏడ్చిన వాళ్ళు ఇంకా రాష్ట్రం ఏర్పడకముందే దళిత హామీని తుంగలో తొక్కి,  ఇక్కడే పుట్టినా నా వాళ్ళు కాదు అనగలిగే కుత్సిత బుద్ది కల వాళ్ళు,  అరాచక వాదులు, దౌర్జన్య వాద తెలబానులు తెలుగు నేలను ముక్కలు చేసి, రాజ్యాధికారం చేపట్టడాన్ని నిరసిస్తూ --

మీరు నాతో ఏకీభవిస్తే మీ నిరసనని ఏ రూపం లో అయినా గట్టిగా తెలియజేయండి.